Breaking NewscrimeHome Page SliderPoliticsTelangana

హైడ్రాపై తిరగబడ్డ రియల్టర్స్

తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చావాలా, బ్రతకాలా? ఫార్మ్ ల్యాండ్స్ కొనొద్దు అని ప్రజలకు చెప్పే అధికారం హైడ్రాకు ఎక్కడిది? ఇప్పటివరకు మీరు చేసిన కూల్చివేతల వల్ల ఎన్ని చెరువులను కాపాడారు? అంటూ హైద్రాబాద్ రియ‌ల్ట‌ర్లు హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్‌పై మండిప‌డ్డారు.వివాదాస్ప‌ద సాగుభూముల్లో నిర్మాణాలు చేప‌ట్టినా వాటిని కూడా కూల‌దోస్తామ‌ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన‌ వ్యాఖ్యలపై రియల్టర్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే LRSను రద్దు చేస్తామని, జీపీ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని ఇచ్చిన హామీ రంగనాథ్ కు తెలియదా? అంటూ ప్ర‌శ్నించింది.ప్ర‌జ‌లు తిర‌బ‌డేంత వ‌ర‌కు ప్ర‌వ‌ర్తించొద్ద‌ని సీరియ‌స్ అయ్యింది.చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల మీద మాత్రమే హైడ్రాకు హక్కు ఉందని, పార్మ్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు కాదు.. వాటి గురించి మాట్లాడే హక్కు హైడ్రాకు లేదని గ‌ట్టిగా బ‌దులిచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రతకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రియల్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్య‌క్తం చేసింది.