Home Page SliderNational

మార్కెట్ షేర్ కోసం ఆస్తుల విక్రయానికి ఎల్‌ఐసీ ప్రయత్నం

ఎల్‌ఐసీ ఇండియా తన సంస్థ మార్కెట్ షేర్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా సంస్థకు చెందిన భూములు, భవనాల అమ్మకానికి ప్రయత్నిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో సహా దేశంలోని ఇతర నగరాలలో కూడా ఆస్తులను విక్రయించే అవకాశం ఉంది. దీనిద్వారా ఆరేడు బిలయన్లు సేకరించాలని భావిస్తోంది. మరో వైపు టైర్ 2, టైర్ 3 ప్రాంతాలలో కూడా విస్తరించేందుకు సంస్థ కృషి చేస్తోంది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా ఇన్సూరెన్స్ రంగంలో లాభాలు పొందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.