Andhra PradeshHome Page Slider

ఈనెల 27న ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈసారి ఆయన ఢిల్లీ పర్యటన ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతుంది. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. మరో ఏడాది కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా తొమ్మిది రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటినుండే గెలుపోటములపై లెక్కలేసుకుంటుంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని వేదికగా ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కీలక సమావేశానికి జగన్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లపై మరోసారి గళమెత్తనున్నారు.

రాష్ట్రం ఎదుర్కొంటున్న విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వినిపించనున్నారు. ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు రాష్ట్రానికి రావలసిన నిధులు గురించి వివరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన జగన్ నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ సీఎంఓ వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

అదే క్రమంలో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం సీఎంఓ వర్గాలు ఆయన పేషీకీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 27వ తేదీన ఢిల్లీ వెళ్ళనున్నట్లు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.