InternationalNews

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

ఈ రోజు స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లు మగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్న నేపథ్యంలోఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల్లో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. నేడు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 54 పాయింట్ల లాభంతో 59,085కి చేరుకుంది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 17,605 వద్ద స్థిర పడింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. టాటా స్టీల్‌, టీసీఎస్‌, టైటాన్‌, సన్‌ఫార్మా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లూజర్స్‌గా మిగిలాయి.