Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTrending Today

జగన్ సైకో ….అసెంబ్లీలో బాలయ్య షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపారు. కూటమి ప్రభుత్వంపైనే కాకుండా, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కూడా బాలయ్య తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీలో ప్రసంగిస్తూ బాలకృష్ణ, జగన్‌ను “సైకో” అని సంబోధించారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. జగన్‌పై మాత్రమే కాకుండా, సొంత కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులపైనే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. “చిరంజీవి ఒత్తిడి వల్లే జగన్ సినీ ఇండస్ట్రీ పెద్దలను కలిశారని కామినేని చెప్పడం పూర్తిగా అవాస్తవం” అని బాలయ్య అన్నారు.
సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై గత వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి సహా పలువురు నేతృత్వంలో జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో “హీరోలను జగన్ అవమానించారు” అని కూటమి నేతలు ఆరోపించినప్పటికీ, కామినేని చెప్పినట్టు నిజాలు వక్రీకరించకూడదని బాలకృష్ణ హెచ్చరించారు.

జనసేన మంత్రి కందుల దుర్గేష్పైనా బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కమిటీలో తన పేరు 9వ స్థానంలో ఉంచారని మండిపడ్డారు. ఇలాంటి తప్పిదాలు దిద్దుకోవాలని మంత్రికి చురకలంటించారు.

బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జగన్‌ను సూటిగా “సైకో” అని సంబోధించడం, అదే సమయంలో సొంత కూటమి మంత్రులపైనే బహిరంగంగా విమర్శలు చేయడం, అసెంబ్లీలో ఈ తరహా భాష ఉపయోగించడం తగదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా, బాలయ్య హాట్ కామెంట్స్‌తో అసెంబ్లీ వేదిక బుధవారం ఉద్రిక్త వాతావరణాన్ని సాక్ష్యమిచ్చింది.