Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTelanganatelangana,

మందుబాబులకు చేదు వార్త… మందు షాప్ లు బంద్

తెలంగాణలో ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగ శోభాయాత్రలకు శంకుస్థాపనగా నగరంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలను రెండు రోజులపాటు మూసివేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. జూలై 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారంగేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రామ్‌గోపాల్‌పేట, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని వైన్ షాపులు మూసివేయాల్సిందిగా ఆదేశించారు. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయాన్ని సందర్శించనుండటంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల ముందు నుంచే గస్తీ పెంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా భావించే భవిష్యవాణి కార్యక్రమం మాతంగి స్వర్ణలత భక్తురాలు పచ్చికుండపై నిల్చొని చెబుతుందనే భక్తుల గాఢ నమ్మకం ఉంది. పండుగ సంబరాల్లో భాగంగా నగరమంతా కళతీరంగా మారింది. బోనాల పండుగను ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.