ఒలింపిక్స్ నిర్వహించే సత్తా బారత్ కు ఉందా?
ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్ను నిర్వహించడానికి భారత్ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేస్తూ గతేడాది అక్టోబర్లో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి(ఐఓసీ) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్కు అధికారికంగా లేఖ పంపించింది. అయితే ఒలింపిక్స్ను నిర్వహించడం అషామాషీ వ్యవహారం కాదు. అందుకు రూ. వేల కోట్లలో ఖర్చును భరించాల్సి ఉంటుంది. భారత్లో ఒలింపిక్స్ను నిర్వహించడానికి రూ.34,700 కోట్ల నుంచి రూ.64,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో గత రెండు రోజుల నుంచి వరుస కథనాలు వస్తున్నాయి.2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి గుజరాత్లోని గాంధీనగర్లో ఇటీవల హై లెవెల్ కో-ఆర్డినేషన్ కమిటీ మేధోమథన సమావేశం జరిగింది. అందులో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించాలని సంకల్పాన్ని పునరుద్ఘాటించినట్లు సమాచారం. అనంతరం ‘రివ్యూ మీటింగ్ – ప్రిపేర్డ్నెస్ టువార్డ్స్ అందావాద్ 2036’ అనే డాక్యుమెంట్ను విడుదల చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.