NationalNews Alert

దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 15 రైళ్లు మూడు రోజులపాటు రద్దు

రైల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారా..ఒక్కక్షణం ఆగి రద్దయిన ట్రైన్‌లలో మీ రైల్ ఉందేమో చూసుకోండి. నేటినుండి మూడు రోజుల పాటు ఏకంగా 15 రైళ్లను రద్దు చేసింది దక్షిణమధ్య రైల్వే. ఈ రోజు నుండి 12 వ తేదీ వరకూ నిర్వహణ పరమైన కారణాలతో 15 రైళ్లు రద్దయ్యాయి. వాటిలో సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, రేపల్లె, మధిర, కాకినాడ, విశాఖపట్టణం మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ఈరోజు రేపట్లో 13 రైళ్లు రద్దయ్యాయి. 11న సికింద్రాబాద్- మధిర మధ్య నడిచే రైలు, 12న మధిర- సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసారు. వీటిలో కాకినాడ-విశాఖపట్టణం, కాకినాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు, గుంటూరు-విజయవాడ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.