NewsTelangana

4 లక్షల కోట్ల పెట్టుబడులు-కేఏ పాల్

Share with

సెప్టెంబర్‌లో, హైదరాబాద్‌లో తెలుగు ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడాలన్నారు పాల్. రెండు రాష్ట్రాల్లో 2 కోట్ల మంది వరద బాధితులున్నారని… కానీ ఆదుకునే నాయకుడు లేకుండా పోయారన్నారు. తెలంగాణలో అధికారం లోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు, పంట నష్టపోయిన వారికి ఆర్థిక సాయం, వరద బాధితులకు సహాయం అందిస్తానన్నారు కేఏ పాల్. తెలుగు ప్రజలు నిరుత్సాహ పడొద్దని భరోసా ఇచ్చారు. తెలుగుప్రజలకు న్యాయం జరిగేందుకు అందరితో కలిసి పోరాటం చేస్తానన్నారు. త్వరలో భారత్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగబోతుందన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్‌లో సదస్సులు నిర్వహిస్తున్నామన్న పాల్… ఈ సమావేశాల్లో ప్రపంచ దేశాల అధ్యక్షులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు సదస్సుకు హాజరవుతారన్నారు. ఎకనమిక్ సమ్మిట్ తో 8 లక్షల కోట్ల పెట్టుబడులు దేశానికి వస్తాయని… ఏపీ, తెలంగాణకు 4 లక్షల కోట్లు, గుజరాత్‌కి 4 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు.