Home Page SliderTelangana

బాసరలో చిచ్చు పెట్టిన  దళితబంధు

Share with

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం వికటించింది. చిచ్చు పెట్టింది. దళితులపై సర్పంచ్ దాడి చేశారని ఫిర్యాదు చేశారు దళితులు.  తమకు అనుకూలమైన వారికే, పార్టీకి పనిచేసే వాళ్లకే ఈ పథకం లభిస్తోందనే ఆరోపణలు చేశారు. అదేమని అడిగినందుకు మహిళలపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ప్రకటించిన నాడే ఈ గొడవ జరగడం వివాదాస్పదమయ్యింది. చాలా చోట్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగమవుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.