Home Page SliderInternationalNational

విజయప్రియ నిత్యానంద ఎవరు?

వివాదాస్పద నిత్యానంద దేశంగా పిలవబడే ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (USK) ప్రతినిధులు గత నెలలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యారు. ఇది భారతదేశంలోని చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మహిళా ప్రతినిధుల బృందం ఫొటోలను నిత్యానంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సభ్యులలో విజయప్రియ నిత్యానంద, ‘కైలాస’ UNలో మాట్లాడటం సంచలనం కలిగించింది. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల కమిటీ (CESCR) నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడుతూ, “హిందూ మతం అత్యున్నత వ్యక్తి” కోసం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హిందూమతంలోని ప్రాచీన సంప్రదాయాలను పునరుద్ధరించినందుకు నిత్యానంద వేధింపులకు గురవుతున్నారని, ఆయన పుట్టిన దేశం నుంచి నిషేధించారని ఆమె అన్నారు.

విజయప్రియ నిత్యానంద ఎవరు?
చీర కట్టుకుని, తలపాగా ధరించి, ఆభరణాలతో ఉన్న ఆ మహిళ UN సమావేశంలో “కైలాస యునైటెడ్ స్టేట్స్ శాశ్వత రాయబారి” అని తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె Facebook ప్రొఫైల్ ప్రకారం, ఆమె వాషింగ్టన్, DC లో నివసిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేయబడిన ఫోటోలు విజయప్రియ తన కుడి చేతిపై నిత్యానంద భారీ టాటూతో కన్పించారు. విజయప్రియ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, మానిటోబా విశ్వవిద్యాలయం నుండి మైక్రోబయాలజీలో బీఎస్సీ ఆనర్స్ చేసింది. ఆమె జూన్ 2014లో విశ్వవిద్యాలయం డీన్ గౌరవ జాబితాలో ఉంది. విజయప్రియకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, క్రియోల్, పిడ్జిన్ (ఫ్రెంచ్ ఆధారిత) అనే నాలుగు భాషలు తెలుసునని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ పేర్కొంది. ‘కైలాస’కు ఒక వెబ్‌సైట్ కూడా ఉంది, అందులో విజయప్రియ నిత్యానంద దేశం తరపున సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారని పేర్కొంది. ఫిబ్రవరి 24న జరిగిన UN సమావేశంలో, ఆమె అనేక దేశాల ప్రతినిధులను కలుసుకున్నారు. ఆ చిత్రాలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్నారు. కొన్ని ఇతర ఫోటోలు విజయప్రియ అమెరికన్లుగా చెప్పుకునే కొంతమంది అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చూపుతున్నాయి. 150 దేశాల్లో తమకు రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని ‘కైలాస’ వెబ్‌సైట్ కూడా పేర్కొంది.

విజయప్రియ నిత్యానంద ప్రకటనపై UN ఏం చెప్పింది?
కల్పిత దేశానికి చెందిన ప్రతినిధులు చేసిన ప్రకటనలను తాము పట్టించుకోబోమని ఐక్యరాజ్యసమితి అధికారి బీబీసీకి తెలిపారు. ఐక్యరాజ్యసమితి సమావేశానికి ‘కైలాస’ ప్రతినిధులు హాజరుకావడం భారతదేశంతో పాటు ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఈ విషయంపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

‘కైలాస’ ఎక్కడ ఉంది?
నిత్యానంద తనపై అత్యాచారం, లైంగిక వేధింపులతో సహా అనేక కేసులతో సంవత్సరాల క్రితం భారతదేశం విడిచిపెట్టాడు. ఐతే ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. భారతదేశాన్ని విడిచిపెట్టిన తరువాత, అతను 2019 లో ఈక్వెడార్ తీరంలో ఒక ద్వీపంలో ‘కైలాస’ని స్థాపించాడని బీబీసీ రిపోర్ట్ చేసింది. హిమాలయాలలో శివుని పౌరాణిక నివాసంగా పరిగణించబడే పర్వతం పేరు మీద ఈ దేశానికి పేరు పెట్టారు. ఆ సమయంలో, ఈక్వెడార్ నిత్యానంద దేశంలో లేడని కొట్టిపారేసింది. స్వయంప్రకటిత దేవుడు- 2019 నుండి బహిరంగంగా కనిపించనందున ఉపన్యాసాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేస్తున్నారు.