home page sliderHome Page SliderTelangana

కొండా సురేఖ అంత మాట అనేశారేంటి..?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ‘నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు. మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని వాళ్లతో చెప్పాను. బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించాను’. అని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ లోని క్రిష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.