తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్లి..
తన తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా యశస్విని పనిచేస్తుంది. అయితే.. తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ను గిఫ్ట్గా ఇచ్చి సర్ఫ్రైజ్ చేయాలనుకుంది. తోటి ఉద్యోగితో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్పై యశస్విని బయలుదేరింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యశస్విని మృతి చెందింది. యశస్విని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.

