త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం..
బీఆర్ఎస్ హయంలో అధికార దుర్వినియోగం చేసిన వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లా డారు.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను నిలువున మోసం చేశారని కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే శాంపిల్ గా దళితబంధు, రైతుబంధు ఇచ్చి ఓట్లు దండుకున్నారు తప్ప చేసిందేమీ లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పది నెలల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కేటీఆర్ బయటి దేశాల నుంచి సోషల్ మీడియాకు కోట్లను ఖర్చు పెట్టి నడిపిస్తుండు. మూసీ, హైడ్రా పై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. డబ్బుల కోసమే ప్రాజెక్టులు కట్టి డబ్బులు దండుకున్నవారే మూసీపై ప్రజలను మభ్యపెడుతున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజాపాలన కొనసాగిస్తున్నామని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

