హైదరాబాద్ గడ్డపై ముస్లిం రిజర్వేషన్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామన్నారు. ఆ రిజర్వేషన్లను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచిపెడతామన్నారు. ఇవాళ హైదరాబాద్లో జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నాడు కేసీఆర్ సర్కారు అవినీతికి పాల్పడితే, ఇప్పుడాపనిని కాంగ్రెస్ చేస్తోందన్నారు. ఓవైసీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటికీ భయమేనన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరవుతారని ఆయన ప్రశ్నించారు.