కేంద్ర మంత్రి గడ్కరీకి అస్వస్థత
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్లో 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. శంకుస్థాపనకు హాజరైన సమయంలో ఆయన స్టేజిపై అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు పక్కనున్న గ్రీన్ రూంలోకి విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. అక్కడే మంత్రికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. అనంతరం డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని ఎంపీ నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

