17న గద్వాలలో కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభ
గద్వాల: ఈ నెల 17వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గద్వాలకు రానున్నట్లు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హోం మంత్రి రానున్నారని గద్వాలలో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలిపారు. అదేవిధంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీరాములయ్య ఈ నెల 15వ తేదీన గద్వాలకు రానున్నట్లు తేరు మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సభలకు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.