వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ బుధవారం ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ఆమోదించింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ రావాలని కోరారు. తరచుగా ఎన్నికలు దేశ పురోగతికి ఆటంకాలు సృష్టిస్తాయని రామ్ నాథ్ కోవింద్ ప్యానెల్ నివేదిక వాదించింది. “ఒక దేశం, ఒకే ఎన్నికలు” కోసం దేశం ముందుకు రావాలి” అని ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి కోరారు. అంతకుముందు, మంగళవారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మోడీ 3.0 యొక్క 100 రోజుల విలేకరుల సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలోనే ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అమలు చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికలను అమలు చేయాలని యోచిస్తున్నామని ఆయన చెప్పారు.

