టీటీడీ కీలక నిర్ణయం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాలు, సేవలు, వసతులు తదితర టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించి, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది.కేవలం అమలుకే పరిమితం కాకుండా సంబంధిత నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది.దీనికి గతేడాది ఆగస్టు 5న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. ఈచర్యతో ఒకరి పేరుతో మరొకరు రాకుండా నిరోధించేందుకు, సేవలు పొందేటప్పుడు తనిఖీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు వీలవుతుందని టిటిడి అధికారులు పేర్కొన్నారు.
Breaking news: టీటీడీ కీలక నిర్ణయం!