Home Page SliderTelangana

TSPSC: నేడు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పీడ్ పెంచారు. నేడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ)పై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే బోర్డులో ఉన్న మిగతా సభ్యులు కూడా నేడు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బోర్డు పూర్తిస్థాయి ప్రక్షాళన తర్వాతే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు TSPSC పరీక్షలన్నింటినీ రీ షెడ్యూల్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ జరగనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను TSPSC విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.