రేపు నాలుగో దశ ఎన్నికల పోలింగ్
2024 లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ మే 13, సోమవారం జరగనుంది. తొమ్మిది రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల 3వ దశ వరకు, 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 283 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా ముగిసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

