గాలికి కొట్టుకుపోయిన టోల్ ప్లాజా
ఛత్తీస్ గఢ్ లో భారీ వర్ష కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. భారీగా ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్ లు నేలకూలాయి. గాలుల ధాటికి రాయ్ పూర్ జిల్లా మండలం తారపొంగి గ్రామ సమీపంలోని టోల్ ప్లాజా పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. రేకులు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

