Breaking NewsHome Page SliderTelangana

రాజాసింగ్ కు ముప్పు

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. భద్రత వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదంటూ రాజాసింగ్ కు పోలీసులు లేఖ రాశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు. ఎక్కడికైనా వెళ్తే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, సెక్యూరిటీని వినియోగించుకోవాలన్నారు. రాజాసింగ్ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్న సంగతిని గుర్తు చేశారు.ఇటీవ‌ల ఆయ‌న సొంత పార్టీ నేత‌ల‌పైనా విరుచుకుప‌డుతున్నారు.బీజెపిలోని పాత సామాను అంతా తొల‌గించాల‌ని కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.దీంతో ఆయ‌న ఇంటా బ‌య‌టా తీవ్ర ఇబ్బందులు ,విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.ఈ నేప‌థ్యంలో పోలీసులు రాజాసింగ్ ని హెచ్చ‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.