చంద్రుడికి రాముడిచ్చిన మాట..ఒంటిమిట్ట కళ్యాణం కథ ఇదే..
శ్రీరామనవమి రోజున భద్రాచలం శ్రీసీతారామకళ్యాణం వీక్షించిన భక్తుల జన్మ ధన్యం. ఏటా నవమి రోజు మధ్యాహ్నం నిర్వహించే కల్యాణం తాను చూడలేకపోతున్నానని బాధపడిన చంద్రుడికి శ్రీరాముడిచ్చిన మాట ప్రకారం ఒంటిమిట్టలో శ్రీరామనవమి తర్వాత వచ్చే పున్నమి రోజు తమ కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసం. పున్నమి వెన్నెల కాంతులలో ఈ కళ్యాణాన్ని వీక్షించమని రామచంద్రమూర్తి చంద్రునికి మాటిచ్చారట. అందుకే ఒంటిమిట్టలో పౌర్ణమి నాటి రాత్రి చంద్రునికి కనిపించేలా విశాలమైన మైదానంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 11నాడు శుక్రవారం సాయంత్రం రాములోరి కల్యాణం వేడుకగా జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సీతారాముల కల్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2 వేల మందికి పైగా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాములోరి కల్యాణానికి వేల సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.
Breaking news: గిబ్లీ యాప్పై తమిళనాడు సర్కార్ హెచ్చరిక