‘తెలుసు కదా’ Movie షెడ్యూల్ ఇదే..!
టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ, నీరజ కోన డైరెక్షన్లో ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తున్నాడు. కాగా డీజే టిల్లు యాక్టర్ కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యేదెప్పుడో ఎదురుచూస్తున్న సినీ జనాల కోసం ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తెలుసు కదా చిత్రీకరణ మొదలైంది. ఈ ఏడాది టిల్లు 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడని తెలిసిందే. ప్రస్తుతం పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన డైరెక్షన్లో తెలుసు కదా సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీలో రాశీఖన్నా ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మొదటి రోజు షూటింగ్లో సిద్దు, రాశీఖన్నా జాయిన్ అయ్యారు. 30 రోజులపాటు సాగనున్న ఈ షెడ్యూల్లో టాకీ సీక్వెన్స్తోపాటు సాంగ్స్ను షూట్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి మరో ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తూండగా.. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. ప్రొడక్షన్ డిజైనర్గా అవినాష్ కొల్లా, కాస్ట్యూమ్స్ డిజైనర్గా శీతల్ శర్మ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్టైలిష్డ్గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిద్దు జొన్నల గడ్డ మరోవైపు టిల్లు ప్రాంఛైజీలో టిల్లు 3 కూడా చేయబోతున్నాడని తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.