టీ20 లో ఇదే అత్యధిక స్కోర్.. 20 ఓవర్లలో 349 రన్స్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. సిక్కింతో మ్యాచ్ లో బరోడా 20 ఓవర్లలో 349/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భాను పూనియా 51 బంతుల్లో 134 రన్స్ తో చెలరేగి ఆడాడు. అతడి ఇన్నింగ్స్ లో 15 సిక్సర్లు, 5 ఫోర్లున్నాయి. శివాలిక్ శర్మ 55, అభిమన్యు సింగ్ 53, సోలంకి 50 రన్స్ తో రాణించారు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సిక్కిం 20 రన్స్ 3 వికెట్లు కోల్పోయింది.