Breaking NewsHome Page SliderNational

అత్య‌ధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది వీరే!

భార‌త స్వాతంత్య్రం త‌ర్వాత అత్య‌ధిక సార్లు లోక్ స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వారిలో ఏడుగురు నిలిచారు.ఇందులో అత్య‌ధిక సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్టిన మ‌హిళా మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్ నిలిచారు.ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం పి.చిదంబరం 9, ప్రణబ్ ముఖర్జీ 8, సీడీ దేశముఖ్ 7, డాక్టర్ మన్మోహన్ సింగ్ 6, టీటీ కృష్ణమాచారి 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు.