తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి సస్పెండ్.. పీసీసీ ఛీఫ్ రియాక్షన్..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 5, 2025 న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో వైపు మల్లన్న సస్పెన్షన్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని చెప్పారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని పేర్కొన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టమని మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.