Home Page SliderTelangana

బీఆర్​ఎస్​పై యుద్ధం మొదలైంది… ఆట మీరే మొదలు పెట్టారు

బీఆర్​ఎస్​పై యుద్ధం మొదలైంది ఆట మీరే మొదలు పెట్టారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నా రు. రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు శంషాబాద్‌ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ.. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. అనంతరం అక్కడ కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “రెండు పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్‌లో కూర్చొని అణిచివేస్తారా? “అని దుయ్యబట్టారు.
‘‘ తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. రెండు పడక గదుల ఇళ్లూ వారికి ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్‌పై మా ఉద్యమం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ప్రజల సమస్యల తరఫున ఈ యుద్ధం కొనసాగిస్తాం. మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. ఎన్నో సార్లు జైలుకు వెళ్లాం. తండ్రిని అడ్డం పెట్టుకొని మాకు పదవులు రాలేదు.బీఆర్‌ఎస్ పాపాలు పండాయి. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు ఇవాళ్టి పరిణామాలపై ఆలోచించాలి’’ అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. 50 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత తనదేనన్నా రు. బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్ కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవని ప్రశ్నించారు.పేదల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నా రు. అరకొరగా కట్టిన ఇండ్లు కూడా 9 ఏళ్లుగా ఎవరికి ఇవ్వ లేదన్నా రు. తొమ్మిది సంవత్సరాలైనా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని, చేతకాని ప్రభుత్వం అంటూ విమర్శించారు. కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారు కాబట్టే బీజేపీ నేతలను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నన్ను చంపేసినా ..నేను ఇంటికి మాత్రం వెళ్ళను అని ఉద్రేక పూరితంగా మాట్లాడారు కిషన్ రెడ్డి