Home Page SliderTelangana

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణా ప్రభుత్వం భారీ పారితోషికం

తెలంగాణాలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణా ప్రభుత్వం భారీ పారితోషికాన్ని అందించింది.కాగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కును అందించారు. ఈ మేరకు తెలంగాణా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య , కేతావత్ సోంలాల్‌‌‌‌కు సీఎం చెక్కును అందజేశారు. అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను అందించిన సందర్బంగా వారంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.