ప్రధాని వారణాసిలో ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిరాన్ని ప్రారంభించారు
వారణాసి: ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా తన నియోజకవర్గం వారణాసిలో ఉన్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్వేద్ మహామందిరాన్ని ప్రారంభించారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇక్కడ గడిపే ప్రతిక్షణం అద్భుతంగా ఉంటుంది. కాశీ నాకెప్పుడూ సొంతింటికొచ్చిన అనుభూతినిస్తుంది. సాధువుల మార్గదర్శకత్వంలో జరిగిన నూతన నిర్మాణాలు, అభివృద్ధి విషయంలో కాశీ ప్రజలు సరికొత్త రికార్డులు సృష్టించారు. అందుకు ఈ మహామందిరం ఓ నిదర్శనం అని మోడీ అన్నారు.

