Andhra PradeshHome Page Slider

 ‘కంపెనీయే బాధితులకు పరిహారం చెల్లిస్తుంది’..చంద్రబాబు

అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీయే బాధితులకు పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. రెడ్ కేటగిరీ పరిశ్రమలన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. ఈ కంపెనీ యాజమాన్యం ఇంకా ప్రభుత్వానికి అందుబాటులోకి రాలేదన్నారు. పరిశ్రమల అనుబంధ శాఖలన్నీ ఒక ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఓనర్ షిప్‌లో సమస్యలు కూడా ఈ ప్రమాదానికి కారణం అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీని వేస్తామన్నారు.