Home Page SliderTelangana

జూనియర్ డాక్టర్ల సమ్మెకు తాత్కాలిక బ్రేక్

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈ క్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. బుధవారం ఇందుకు సంబంధించిన రెండు జీఓలు విడుదల చేయనుంది.