Home Page SliderNews AlertTelangana

కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌

కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7పై తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించింది.  అయితే… బుధవారం రోజున తెలంగాణలో 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పాజిటివ్‌ శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌గా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరించింది.