News

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

తెలుగు నూతన సంవత్సరం ‘ శోభకృత్’ నామ సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఉగాది వ్యవసాయానికి శుభప్రదంగా పరిగణించబడుతుందని, ఇది రైతులతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రజలకు శుభసూచకమన్నారు. సాగునీరు, తాగునీరుతో పాటు పంటల సాగులో తెలంగాణ సమృద్ధిగా మారిందని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దాని అనుబంధ రంగాలు, సంబంధిత వృత్తుల అభివృద్ధికి హామీ ఇచ్చిందని, ఇది తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ‘శోభకృత్‌’ సంవత్సరం తెలంగాణకే కాకుండా భారతదేశానికి కూడా సుభిక్షాన్ని, అభివృద్ధిని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్.