Home Page SliderTelangana

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ముగిసింది. తెలంగాణలో బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీల మేరకు.. అందుకు కావాల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై మంత్రుల సమావేశంలో చర్చించారు.