తెలంగాణ సర్కార్ కు సుప్రీం నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గతంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేయడంతో తాజాగా ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది.

