బ్యాంకు ఉద్యోగుల సమ్మె…లావాదేవీలుంటే త్వరగా చేసుకోండి
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) మార్చి 23 అర్ధరాత్రి నుంచి మార్చి 25 అర్ధరాత్రి వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. హైదరాబాద్లో బుధవారం యూఎఫ్బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె.ఆంజనేయప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ బీఎస్ రాంబాబులు ఈ మేరకు ప్రకటించారు.బ్యాంకు కార్యకలాపాలు,లావాదేవీలు పెద్ద మొత్తంలో జరిపే వారు సమ్మె విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే నిర్వహించుకోవాలని కోరుతున్నారు.
