Home Page SliderTelangana

టోల్ చెల్లించాలని కారును ఆపినందుకు సిబ్బందిపై దాడి

టోల్ చెల్లించాలని కారును ఆపినందుకు సిబ్బందిపై రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద చోటు చేసుకుంది. తాను ప్రభుత్వ ఉద్యోగిని అని టోల్ చెల్లించాడనికి నిరాకరించాడు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో సర్వే & రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా సిద్దిఖీ పనిచేస్తున్నాడు. టోల్ కట్టి వెళ్లాలంటూ టోల్ సిబ్బంది వాహనాన్ని ఆపేశాడు. దీంతో వాహనం నుండి దిగి టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ సిద్ధిఖీ మరియు అతని బంధువు దాడి చేశారు. దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.