Home Page SliderTelangana

డీఎస్సీ అభ్యర్థులకు షాకింగ్ న్యూస్

తెలంగాణలో ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇస్తారనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. విద్యాశాఖ కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తూ ప్రకటన రీలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కౌన్సెలింగ్ కోసం కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. ఇక డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు సంబరపడిపోయారు. ఇక కౌన్సెలింగ్ అవ్వడమే లేటు పోస్టింగ్ వచ్చేస్తుందనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆఖరి నిమిషంలో విద్యాశాఖ కౌన్సెలింగ్ ను వాయిదా వేసింది. దీంతో అభ్యర్థులు షాక్ కు గురయ్యారు.