Home Page SliderTelangana

సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్..

ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి మేడ్చల్ కోర్ట్ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్ నగర్ లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళా కబ్జా చేసింది. ఆ సమయంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ గా పనిచేసిన జ్యోతి.. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు పద్మజా రెడ్డికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పద్మజా రెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతిపైన పోలీసులు కేసు నమోదు చేశారు.