డాక్టర్ల నిర్లక్ష్యంతో 12 ఏళ్లుగా మహిళ కడుపులో కత్తెర
సిక్కింకు చెందిన బాధిత మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్ టక్ లోని ఓ ఆసుపత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాతి నుంచి ఆమె తరచుగా కడుపునొప్పితో బాధపడింది. చాలామంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. నొప్పికి కారణం కూడా వారు గుర్తించలేకపోయారు. ఈ నెల 8న ఆమె తనకు గతంలో అపెండిక్స్ ఆపరేషన్ చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్ రే తీయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె పొత్తికడుపులో సర్జికల్ కత్తెర చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

