Home Page SliderInternational

పాకిస్తాన్ కు సౌదీ వార్నింగ్

యాత్రికుల ముసుగులో పాకిస్తానీ బిచ్చగాళ్లు తమ దేశంలోకి వస్తున్నారని సౌదీ అరేబియా ఆరోపించింది. బిచ్చగాళ్లకు వీసాలిచ్చి తమ దేశానికి పంపొద్దని పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ కు చెందిన ‘ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ ఓ కథనం ప్రచురించింది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే, పాకిస్తానీ ఉమ్రా, హజ్ యాత్రికులపై తీవ్రంగా ప్రభావం ఉంటుందంటూ కథనంలో తెలిపింది. పాక్ బిచ్చగాళ్లు మా దేశంలోకి రాకుండా చూడాలని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ.. పాక్ కు హెచ్చరిక పంపింది. ఉమ్రా వీసాలతో కొందరు పాకిస్తానీ బిచ్చగాళ్లు వారి దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. బిచ్చగాళ్లు తమ దేశంలోకి రాకుండా చూడాలని కోరిందని ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది.