రూ. 100/- అదనపు కూలీ కోసం యువకుడి దారుణ హత్య
వరంగల్ కరీమాబాద్ లో ఓ బీహర్ యువకుడి మర్డర్ కలకలం రేపింది. 100 రూపాయల అదనపు కూలీ కోసం కరీమాబాద్ యువకులు, బీహర్ యువకులతో గొడవకు దిగారు. బీహర్ నుంచి ఇంటి నిర్మాణ పనులు చేయడానికి దిల్కుష్ కుమార్ (18) అతడి సోదరుడు దులాల చంద్ తో పాటు మరికొందరు వరంగల్ కరీమాబాద్ వద్ద ఇంట్లో రేంటుకు ఉంటున్నారు. నిన్న రాత్రి కరీమాబాద్ కు చెందిన అశోక్, ప్రశాంత్, నగేష్ అనే కూలీలకు, బీహర్ యువకుల మధ్య కీర్తి బార్ వద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో దూలాల చంద్ తన మిత్రులను వరంగల్ రైల్వేస్టేషన్ లో వదిలి వచ్చేసరికి తన తమ్ముడు దిల్కుష్ కుమార్ ఇంట్లో రక్తపు మడుగులో కనిపించాడని పోలీసులకు తెలిపాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. మద్యం మత్తలో హత్య చేసి ఉండవచ్చని పోలీసుల భావిస్తున్నారు.

