Telangana

గుర్రంపై స్వారీ చేస్తూ.. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు మండలం కిష్టాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. రేవంత్ రెడ్డి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. గుర్రంపై స్వారీ చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల కోరిక మేరకు గుర్రపుస్వారీ చేశారు. గ్రామంలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. హస్తం గుర్తుకు ఓటేసి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు.