Andhra PradeshHome Page SliderTrending Today

పందేలకు రెడీ..తగ్గేదే లే..

సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలో భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులతో పాటు  గుర్తొచ్చేది పందెం కోళ్లు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలలో ప్రతీ సంవత్సరం జోరుగా కోడి పందాలు జరుగుతుంటాయి. కొత్త సంవత్సరం ప్రారంభానికి  ముందే ఈ కోడిపుంజులు ప్రత్యేక శిక్షణతో పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఏలూరు, కాకినాడ, అమలాపురం, భీమవరం వంటి పట్టణాలలో వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు మొదలయ్యాయి. బలమైన ఆహారం ఇచ్చి వాటిని పందానికి సిద్ధం చేస్తున్నారు. చట్టవిరుద్ధమైన ఈ పోటీలు నిర్వహించకూడదని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా రహస్యంగా ఈ పందేలు జరిగిపోతుంటాయి.