బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందిన రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్యప్రదేశ్ ఛతర్పూర్లోని బాగేశ్వర్ ధామ్ క్షేత్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని ఆయన కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ధీరేంద్ర కృష్ణ మహారాజ్ను కలిసిన ఫొటోలు వైరల్గా మారాయి.

