Home Page SliderNews

కోర్టు తీర్పు తర్వాత పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ ఉదయం పార్లమెంట్‌కు వచ్చారు. నిరసనల మధ్య లోక్ సభ మధ్యాహ్నానికి వాయిదా పడిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. ‘మోదీ’ ఇంటిపేరుపై చేసిన ఆరోపణలపై కేరళ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పును అప్పీల్ చేసేందుకు గుజరాత్ కోర్టు 30 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. పార్లమెంటు సభ్యుడు ఏదైనా నేరానికి పాల్పడితే, కనీసం రెండేళ్లపాటు శిక్ష అనుభవించినట్లయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం అనర్హతకు గురవుతాడు.