సైకో పాలన అంతం కావాలి : చంద్రబాబు
◆ చింతలపూడిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం
◆ ప్రతి ఒక్కరూ ఇక సైకిల్ ఎక్కాల్సిన సమయం వచ్చింది
◆ సైకిల్ ఆరోగ్యానికి, ప్రజల ఆదాయానికి మంచిది
◆ పాలన సీఎం జగన్ వలన కాని పని
◆ నాతోపాటు ప్రజలకు ఇవే ఆఖరి ఎన్నికలు
ఏపీలో సైకో పాలన అంతం కావాలని పరిపాలన సీఎం జగన్ వలన కాని పని అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఆయన బుధవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ప్రారంభించారు. జంగాల పేట యాదవుల బజార్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రోడ్డు షో నిర్వహించాక ధర్మాజీ గూడెం లింగపాలెం చింతలపూడిలో పర్యటించారు. చింతలపూడి బహిరంగ సభకు ప్రజలు కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పశ్చిమ గోదావరిలో ప్రజలు తనకు ఘనస్వాగతం పలికారని ఈ స్పందన చూసిన తరువాత ఇక ఏ అనుమానం లేదని 2014 ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికల్లో మళ్లీ రిపీట్ అవుతాయన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపెయ్యడానికి కారణం.. సంక్షేమం పేరుతో ప్రభుత్వం రూ.10 ఇచ్చి…100 రూపాయాలు లాగేస్తోందని, వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఒక ముఖ్యమంత్రి సొంత బాబాయి కేసులో విచారణపై సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిందని, నాడు వివేకా చనిపోతే గుండెపోటు అని ప్రచారం చేశారని, తన తండ్రి హత్యపై కుమార్తె సునితారెడ్డి పోరాటం చేస్తోందన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని , ప్రభుత్వాన్ని తప్పు పట్టిందని సునీతా రెడ్డి చెప్పింది కరెక్ట్ని… తెలంగాణ రాష్ట్రానికి కేసును బదిలీ చేసిందని, సిగ్గుంటే ముఖ్యమంత్రి దీనిపై రాజీనామా చెయ్యాలని పేర్కొన్నారు.

సాక్షి గుమస్తా చెప్పాడని…అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే తమ్ముడు తనను చంపేస్తా అని చెపుతున్నాడని,అనుకుని ఉంటే తనను, లోకేశ్ను చంపేసే వాళ్లమని వైసీపీ వాళ్లు చెపుతున్నారని… ఈ తాటాకు చప్పుళ్లకు భయపడనని.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని అన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక వరమని దానికోసం నాడు ఎంతో శ్రమించానని… నాడు పరిహారం విషయంలో స్టేలు తెచ్చుకుంటే అన్నింటినీ పరిష్కరించి ప్రాజెక్టును పరిగెత్తించానని అన్నారు. చింతలపూడిని నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏం చెయ్యాలని… 2019 తరువాత ఒక్క ఉద్యోగం వచ్చిందా….అందుకే ఇప్పుడు జాబు రావాలి…అంటే బాబు రావాలి అని మళ్లీ యువత అంటున్నారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి నాడు మేం తెచ్చిన రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడని,యువతకు ఉపాధి లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏం చెయ్యాలని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడని ,ధాన్యం అమ్మి 8 నెలలు అయినా ఈ ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పామాయిల్ రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని నాడు మద్దతు ధర ఇచ్చి పామాయిల్ రైతులను ఆదుకున్నామని అన్నారు. వచ్చేది తెలుగు దేశం ప్రభుత్వం అని ఎవరు తప్పు చేసినా వారి తాట తీస్తామని హెచ్చరించారు. పోలీసులు మంచి వాళ్లే…కానీ కొందరు మాత్రం నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్నారని,అన్నింటికీ అంతకు అంతా తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.

సుదీర్ఘ కాలం తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని మళ్లీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాను. కానీ నా పోరాటం రాష్ట్రం కోసం అని అన్నారు. జగన్ రెడ్డి అసత్య ప్రచారంతో నాపై కులం ముద్ర వేసే ప్రయత్నం చేశాడని… సామాజిక న్యాయానికి మారుపేరు తానేనని… జీవితాంతం బడుగువర్గాల కోసం పనిచేశానని… వీసీలను నియమించినా, టీటీడీ పదవులిచ్చినా…అన్ని కులాకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. సీఎం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సలహాదారు సాక్షి గుమస్తా సహా అంతా ఒకే జిల్లా వాళ్లన్నారు. ఒకే వర్గం వాళ్లే అని అన్నారు. అధికారుల మీద తనకు కోపం లేదని, నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తులు ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటానని… అలాంటి తనపై ఇష్టాను సారంగా విమర్శలు చేస్తున్నారని… పోలవరాన్ని ముంచేసి తానే కారణం అంటున్నారని అన్నారు. మద్యం అంతా జగన్ రెడ్డి బ్రాండ్స్….తయారీ, అమ్మకం సహా అన్నీ జగన్ వే కదా అని అన్నారు. మద్యపాన నిషేదం అని చెప్పాడని….ఇప్పుడు పెద్ద పెద్ద రిటైల్ షాప్ లు పెట్టి అమ్ముతున్నాడని ,అంటే జగన్ ఏం చేసినా ప్రజలు నమ్మాలా అని, జగన్ మాయలపై ప్రజలు కర్రలు తీసుకుని రడీగా ఉండాలని తప్పులు చెప్పే వారిని చితక్కొట్టాలని పేర్కొన్నారు.

బడుగు వర్గాలను, దళితులను, మైనారిటీలను మోసం చేసిన ప్రభుత్వం ఇదని, విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కింద అంతా పనిచెయ్యాలా….వాళ్ల జాగిరా రాష్ట్రం ఏమన్నా…సామాజిక న్యాయం ఉండదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని వైసీపీ నేతలు ఇసుకను దోచేస్తున్నారని, చింతమనేనిపై 29 అక్రమ కేసులు పెట్టి వేధించారని… మరి ఇన్ని అక్రమాలు చేసిన జగన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలని అన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తానని… తాను దేనికి భయపడనని… నీతి నిజాయితీగా రాజకీయం చేశానని, ఎక్కడా తప్పు చెయ్యలేదన్నారు. ప్రజలు కూడా భయపడితే బానిసలుగా మిగిలిపోతారని తిరగబడకపోతే రాష్ట్ర భవిష్యత్ మిగలదని అన్నారు. సీఎం పరదాలు కట్టుకుని పర్యటనలు చేస్తున్నాడని… ఆడవాళ్ల చున్నీలు నల్లగా ఉన్నాయని సీఎం మీటింగ్ లో వాటిని తీయించాడని, ఆడవాళ్ల చున్నీలు కూడా చూసి జగన్ భయపడుతున్నాడని, జగన్ కు ధైర్యం ఉంటే తనలాగా ప్రజల్లో మీటింగ్ పెట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని..ఇక బయటకు రండి… ధైర్యంగా ఫైట్ చెయ్యండని ప్రజలకు పిలుపునిచ్చారు. 60 లక్షల మంది ఉన్న ఏకైక సైన్యం పార్టీ తెలుగు దేశం పార్టీ అని తప్పుడు కేసులపై ఏ చెయ్యాలో అదే చేస్తామని… వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిస్తామని ప్రజలు ప్రతిజ్క్ష చెయ్యాలని అన్నారు. ప్రభుత్వంపై పోరాడటానికి టీడీపీకి ప్రజలు మద్దతుగా తరలిరావాలని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నట్లు… నేడు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కదలి రావాలని పిలుపునిచ్చారు. మీ ఊళ్లో రోడ్డు వెయ్యలేని సీఎం…రాష్ట్రానికి మూడు రాజధానులు కడతానంటున్నాడని… ప్రతి ఒక్కరు ఇక సైకిల్ ఎక్కాల్సిన అవసరం ఉందని మీ ఆరోగ్యానికి, ఆదాయానికి సైకిల్ మంచిదని, ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ వచ్చిందని ఈ ఫ్యానును నమ్ముకుంటే లాభం లేదని ఆ ఫ్యాన్ ను ప్రజలు చితక్కొట్టాలని ముగించారు.