జైన సాధువు ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోడీ
రాజనందగావ్: ఛత్తీస్గఢ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన డోంగర్గఢ్ను ప్రధాని మోడీ ఆదివారం సందర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ప్రధాని మోడీ ఈ గుడిలోని జైన సాధువు ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ను కలిశారు. ప్రధాని వెంట ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్సింగ్ కూడా ఉన్నారు. తొలివిడత కింద మంగళవారం ఎన్నికలు జరగనున్న 20 స్థానాల్లో డోంగర్గఢ్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది.

